నగరంలోని అర్బన్ బ్యాంక్ నందు ఈరోజు 108 వ మహాజన సభ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్యాంక్ చైర్మన్ జె.యల్.మురళీధర్ గారు మరియు పాలకవర్గం సభ్యులు మరియు సి. ఇ. ఓ పాల్గొని వారు మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఏర్పడి నేటికు 16 నెలల కాలమైనది ఈ 16 నెలల కాలంలో పాలకవర్గం మరియు సిబ్బంది బ్యాంకు ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేశారు, అదేవిధంగా ఈ మహాజన సభ ముఖ్య ఉద్దేశాలు రిజర్వు బ్యాంక్ వారు నియమించిన ఆడిటర్ ని ఆమోదించుట, 2024-25 వ సంవత్సరం అంచనా బడ్జెట్ ఆమోదించుట అలాగే అధ్యక్షుల వారి అనుమతి మేరకు ఇతర అంశాలను ఆమోదించడం జరిగింది.
